హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన రెండో రోజే నలుగురు డిబార్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతుండటంతో అధికారులు గుర్తించి డిబార్ చేశారు.
మంగళవారం నిర్వహించిన రెండో భాష పేపర్కు 99 శాతం విద్యార్థులు హాజరైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.