హైదరాబాద్: వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special trains) నడుపుతున్నది. బుధవారం నుంచి శనివారం (ఈ నెల 10, 11, 12, 13 తేదీ) వరకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వీటిలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైలు కాజీపేట, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. అలాగే, సికింద్రాబాద్ నుంచి యశ్వంత్పూర్కు వెళ్లే రైలు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్నగర్, గద్వాల, డోన్, ధర్మవరం, హిందూపురం, యలహంకా స్టేషన్ల మీదుగా వెళ్తుందని అధికారులు వెల్లడించారు.