బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు (Bijapur Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని అన్నారం-మారిమళ్ల అడవుల్లో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారుం ఉదయం జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.
ఆరు నెలలపాటు ఆయుధాలు పట్టేది లేదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించిన 48 గంటల్లోపే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో బుధవారం ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకోవడం, రెండు రోజుల వ్యవధిలోనే ఏడుగురు మావోయిస్టులు మృతిచెందడం గమనార్హం.