కొమురవెల్లి/జగదేవ్పూర్, డిసెంబర్ 10 : రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన 12 మంది కూలీలు ఉదయం ఆటోలో జగదేవ్పూర్ మండలం గొల్లపల్లికి పత్తి ఏరేందుకు వెళ్లారు. పని ముగించుకొని తిరిగి ఆటోలో పయనమయ్యారు.
జగదేవ్పూర్ మండలం మునిగడప-వట్టిపల్లి మధ్యలో ఆటో డ్రైవర్ ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టాటాఏస్ను ఢీ కొట్టాడు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వైనాల శిరీష(17), పుట్ట జయమ్మ (58) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో డ్రైవర్ తేలు మహేశ్తోపాటు బాలనర్సవ్వ, లచ్చమ్మ, జానాబాయి, దాసరం లక్ష్మి, మల్లవ్వ, కనకవ్వ, గుర్రాల లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని గజ్వేల్ ప్రభుత్వ దవఖానకు తరలించగా చికిత్స పొందుతూ గుర్రాల లక్ష్మి, మల్లవ్వ మరణించారు. దాసరం లక్ష్మి, బోయిన కనకవ్వలను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.