TS Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం ఖమ్మం, సూర్యపేట, జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.
మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలు వీస్తాయన్న పేర్కొంది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని చెప్పింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.