మెండోరా, జూలై 24: ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60 వసంతాలు పూర్తి చేసుకోనున్నది. నిజామాబాద్తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచిన ఈ ప్రాజెక్టుకు 1963 జూలై 26న అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. దాదాపు ఇరవై ఏండ్లకు నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణ గడ్డకు భరోసానిచ్చే ఈ ప్రాజెక్టును సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేశారు. గోదావరి మీద మహారాష్ట్ర విచ్చలవిడిగా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేదు. వరదలు రాక, కాలం కలిసిరాక ప్రాజెక్టు చాలాసార్లు ఎండిపోయింది. ఎస్సారెస్పీ భవితవ్యం ప్రమాదంలో పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అద్భుతాన్ని సృష్టించారు. పునరుజ్జీవ పథకం ద్వారా 300 కిలోమీటర్ల దిగువన ఉన్న కాళేశ్వర గంగను ఎదురెక్కించి ఎస్సారెస్పీకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. 1093 అడుగులు, 103 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు కింద 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. కాగా, బుధవా రం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ముప్కాల్ పంప్హౌస్ వద్ద నిర్వహించనున్న 60 ఏండ్ల ఉత్సవాల్లో పాల్గొననున్నారు.