హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలోనే వెనుకబడిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, పట్నం మహేందర్రెడ్డి కొనియాడారు. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని స్పష్టంచేశారు. సగర కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి హైదరాబాద్లోని కోకాపేటలో ప్రభుత్వం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఆ నిధులతో చేపట్టిన సగర కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్గౌడ్, మహేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భూమిపూజ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణలో కుల సంఘాలు ఆత్మగౌరవంతో ముందుకుసాగాలనే సమున్నత లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలను కేటాయించి, భవనాలు సైతం నిర్మిస్తున్నదని వివరించారు. వీలైనంత త్వరగా చకటి భవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు పెద్దపీట వేస్తూ, వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. బీసీల విద్యాభ్యున్నతికి వెయ్యికి పైకి గురుకులాలను పెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టంచేశారు. రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తూ కులవృత్తుల వికాసానికి కృషి చేస్తున్నారని చెప్పారు. సగర భగీరథ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ ఆసాని మారుతీసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్, ప్రధాన కార్యదర్శి గొరక సత్యం, రాష్ట్ర నాయకులు ముత్యాల హరికిషన్, ఆర్బీ ఆంజనేయులు, కేపీ రామ్సాగర్, శ్రీరాల శ్రీరాములు, బంగారి నర్సింహ, ఉదయ్, జిల్లాల నాయకులు తిరుపతయ్య సాగర్, ప్రణీల్ చందర్, రవి, ఆసాని వెంకటస్వామి, మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి, స్రవంతి, పల్లవి, అమృత, కుసుమ, సువర్ణ, యువజన సగర సంఘం అధ్యక్షులు సతీశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తోనే సామాజిక న్యాయం: వకుళాభరణం
సీఎం కేసీఆర్తోనే సామాజిక న్యాయం సాధ్య మని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో నాయీబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశా రు. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘ భవన నిర్మాణ ట్రస్ట్ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ సూర్యనారాయణ, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకిషన్, పెంబర్తి శ్రీనివాస్, కృష్ణ, రాజు, లింగం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.