హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కంకణబద్ధులై అడుగులు వేస్తున్నారని మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం పీఆర్సీ అమలు చేయటం పట్ల సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఫోరం సభ్యుల సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంస్థలు బలోపేతం అవుతున్నాయన్నారు. తాజాగా ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30 శాతం గౌరవవేతనం పెంచటం అసాధారణ విషయమన్నారు. దీంతో రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో 4,060 మందికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మంత్రులు కేటీఆర్కు, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్కు, జగదీశ్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫోరం బాధ్యులు ఎర్రబెల్లి భాస్కర్రెడ్డి, రహమాన్, మహమ్మద్ సలీమ్, రంగా బ్రహ్మన్నగౌడ్, అర్షద్ అలీ, వెంపటి సురేశ్, బింగి లత, నెరవల్ల కమల, తదితరులు పాల్గొన్నారు.