హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాజీ పీసీసీఎఫ్ పీకే శర్మ తన మూడు దశాబ్దాల అటవీశాఖ అనుభవాల ఆధారంగా ర చించిన ఆత్మకథ ‘ఫుట్ ప్రింట్స్ ఆన్ ఫారెస్ట్” బుధవారం హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల ఇన్స్టిట్యూట్లో ఆవిషరించారు. ఉమ్మడి ఏపీలో అడవుల సంరక్షణ కోసం పీకే శర్మ చేసిన పోరాటం, ఆయనకు ఎదురైన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ ప్రియదర్శి దాస్, భాలే రావు, ఏకే గోయల్, బీపీ ఆచార్య, రేమండ్ పీటర్ మధుకర్ రాజ్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పరేశ్ శర్మ మాట్లాడుతూ ఈ ఆత్మకథ సివిల్ సర్వీసెస్లోకి వచ్చే కొత్తవారికి, అటవీ సంరక్షణ రంగంలో ఉండేవారికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.