కూసుమంచి, సెప్టెంబర్ 5: ఖమ్మం జిల్లాలోని పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాచలంలో కన్నుమూశారు. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భూపతిరావు సీపీఐ తరఫున గెలుపొంది రెండేండ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
భూపతిరావు కుమారుడు భీమపాక నగేశ్ ఇటీవల హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. భూపతిరావు మృతి పట్ల ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.