హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)/ఎర్రవల్లి చౌరస్తా: ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగిన cలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా బీచుపల్లి వద్ద టైర్ పేలడంతో ఆమె ప్రయాణించే కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. డ్రైవర్ బాబ్జీకి గాయాలయ్యాయి. నీరజారెడ్డి 2009-2014లో ఆలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే శేశిరెడ్డి 1996లో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురయ్యారు. మంగళవారం జరిగే శేశిరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి ఆమె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.