నాగర్కర్నూల్ : తను బీఆర్ఎస్ పార్టీ(,BRS party) మారుతున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, అదంతా మీడియాలో తప్పుడు ప్రచారమని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) అన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నాకు దైవసామానులు కేసీఆర్కు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను అని స్పష్టం చేశారు.
మల్కాజిగిరి పార్లమెంటుకు పోటీ చేయాలని అన్ని పార్టీల వారు అడుగుతున్నారు. ఇదంతా మీడియా సృష్టించిన గ్లోబల్ ప్రచారం మాత్రమేనని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నేను ఎప్పుడు ఎక్కడ ఎవరితో పార్టీ మారతానని ఇప్పటివరకు చెప్పలేదని గుర్తు చేశారు. నాకున్న డబ్బులతో పేద ప్రజల బాగు కోసం ఉపయోగిస్తాను కానీ, పార్టీ పనులకు ఉపయోగించనని తెలిపారు. నేను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడినట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.