జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి(Singareni )లో వారసత్వ ఉద్యోగాలు తిరిగి ఇప్పించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra) అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ ఇంక్లైన్లో టీబీజీకేఎస్(TBGKS) గేట్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ సహకారంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిందన్నారు. ఏ జాతీయ సంఘం చేయని పనులు టీబీజీకేఎస్ చేసింది.
కార్మికులకు బోనస్ ఇప్పించడంతో పాటు సంస్థను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్న చరిత్ర బీఆర్ఎస్ది అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ తోనే సింగరేణి సంస్థకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి టీబీజీకేఎస్ను గెలిపించాలన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితులు ఉన్నారు.