మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్లో చేరిన ఆయన సోమవారం మహబూబ్నగర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో శ్రీనివాస్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘మారుతున్న మహబూబ్నగర్ ముఖచిత్రం’ పేరిట నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాన్ని ఎర్ర శేఖర్కు మంత్రి అందజేశారు.
అనంతరం ఎర్ర శేఖర్ మాట్లాడుతూ.. పదేండ్లలో పాలమూరును ఊహించని స్థాయిలో అభివృద్ధిలో పరుగులు పెట్టించిన శ్రీనివాస్గౌడ్కు అఖండ మెజార్టీ ఖాయమని చెప్పారు. ఇందుకోసం తామంతా కష్టపడుతామని స్పష్టంచేశారు. మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటేయాలని కోరారు. పాలమూరులో ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని తెలిపారు.