న్యూఢిల్లీ: తమ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) స్తంభింపజేయడంపై ఆదానీ గ్రూప్ సోమవారం ప్రతిస్పందించింది. ఇది పచ్చి అబద్ధం అని రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పింది.
తమ గ్రూప్కు ఒక రిజిస్ట్రార్ ఉన్నారని వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు ఎఫ్పీఐ ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలను స్తంభింపజేయలేదని పేర్కొన్నది.
ఆదానీ గ్రూప్కు చెందిన ఐదు సంస్థల్లో అబ్దుల్లా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలను ఎటువంటి కారణాలను చెప్పకుండానే ఎన్ఎస్డీఎల్ స్తంభింప చేసింది. దీంతో కొత్త సెక్యూరిటీల క్రయ విక్రయాలను ఈ సంస్థలు చేయలేవు.
ఆదానీ పవర్, ఆదానీ ఎంటర్ప్రైజెస్, ఆదానీ గ్రీన్, ఆదానీ ట్రాన్స్మిషన్, ఆదానీ టోటల్ గ్యాస్ షేర్లు సోమవారం 25 శాతం పతనం అయ్యాయి. నిఫ్టీ-50లో లిస్టెడ్ ఆదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ షేర్లు 19 శాతం పతనమై తిరిగి కొంత నష్టాలతో ముగిశాయి.
ప్రస్తుతం ఆదానీ గ్రూప్కు చెందిన 12 మంది అగ్రశ్రేణి ఇన్వెస్టర్లలో మూడు ఎఫ్పీఐ ఇన్వెస్టర్లు ఉన్నాయి. ఐదు ఆదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు గతేడాది మార్చి నుంచి పది రెట్లకు పైగా పెరిగాయి.
ఇటీవల స్టాక్ మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో ఆసియా ఖండంలోనే రెండో కుబేరుడిగా గౌతం ఆదానీ నిలిచారు. ఆసియాలోనే మొదటి కుబేరుడిగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్న సంగతి తెలిసిందే.