ఆత్మకూరు(ఎం), ఏప్రిల్3 : ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తల్లి బూడిద సత్తమ్మ (85) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని స్వగ్రామం పారుపల్లిలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు.
భిక్షమయ్యగౌడ్ కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు సత్తమ్మ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.