హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ను దారుణంగా అవమానించిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల సుమన్ ఆరోపించారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేదర్ విగ్రహం వద్ద ఎలాంటి అలంకరణలు చేయలేదని, కనీసం పూలమాల వేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్కు ఇంత దుర్మార్గం? ఇంత అహంకారం? ఇంత కండ్లునెత్తికెత్తిన టెంపరితనమేంటని ప్రశ్నించారు. భేషరతుగా రేవంత్ దేశ ప్రజలకు, దళిత సమాజానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణభవన్లో సహచర నేతలు గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులతో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేదర్ విగ్రహం కేసీఆర్ ఏర్పాటుచేశారనే అకడ అలంకరణలు చేయలేదా? దీనికి సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టామని, కేసీఆర్ కట్టిన సచివాలయంలో రేవంత్ ఎలా కూర్చుంటున్నడని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ గుర్తులను చెరిపేస్తామని రేవంత్ అన్నారని, కాళేశ్వరం నీళ్లను రైతులకు అందకుండా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సీఎం ఫ్యూడల్ మైండ్ సెట్తో ఉన్నారని. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. స్వయంగా భట్టికి అవమానం జరిగినా ఆయనే పట్టించుకోకపోగా, కనీసం అంబేద్కర్ అవమానించినా స్పందించకపోవడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టికి చిన్నపీట వేసినా మౌనంగా ఉన్నారని, అంబేదర్ రిజర్వేషన్లతోనే భట్టి డిప్యూటీ సీఎంగా అయ్యారన్నారని గుర్తుచేశారు.
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచిన రేవంత్రెడ్డి సర్కారు తీరుపై దళిత సంఘాలు, మేధావులు స్పందించాలని కోరారు. గతంలో అనేక విషయాలపై స్పందించిన లౌకికవాదులు, మేధావులు నోరు విప్పాలని సూచించారు. రేవంత్రెడ్డి నయా దేశ్ ముఖ్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 125 అడుగుల అంబేదర్ విగ్రహం వద్ద కనీసం పరిసరాలను శుభ్రం చేయలేదని, విగ్రహానికి కనీసం దండవేయలేదని, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశంలో బీజేపీ దుర్మార్గపు, అరాచకపాలనను కొనసాగిస్తున్నదని బాల్క సుమన్ మండిపడ్డారు. బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని, బీజేపీ మ్యానిఫెస్టో అంతా అబద్ధాల మయమని అభివర్ణించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మోదీతో జోడికట్టకపోతే ఈడీ, సీబీఐ వస్తాయని విమర్శించారు. ఉత్తర భారతంలో కొరకరాని కొయ్యగా మారిన కేజ్రీవాల్ను అరెస్టుచేశారని, దక్షిణాదిలో కేసీఆర్ కుమార్తె కవితను అన్యాయంగా జైళ్లోపెట్టారని ఫైరయ్యారు.
లిక్కర్ పాలసీ కేసుతో సంబంధమున్న మాగుంట శ్రీనివాస్రెడ్డి ఏపీలో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీచేస్తున్నారని, అజిత్పవార్, ప్రపుల్పటేల్, హిమంత బిశ్వశర్మ, ఏపీలో సీఎం రమేశ్, కొత్తపల్లి గీత, సుజనాచౌదరి, అమరీందర్సింగ్, సువెందు అధికారి బీజేపీలో చేరగానే కేసులు మాఫీ చేశారని గుర్తుచేశారు. బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మాలా మారిపోయిందని మండిపడ్డారు. కక్షగట్టి కేసీఆర్ను ఏం చేయలేక కవితను అరెస్టు చేశారని విమర్శించారు. మోదీతో కుమ్మక్కు అయ్యే రేవంత్రెడ్డి అనేక పార్లమెంట్ స్థానాల్లో బలహీన అభ్యర్థులను బరిలో దింపారని ఆరోపించారు. బడేబాయ్, చోటేబాయ్ ఒక్కటయ్యారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరతారని ఆరోపించారు. బీఆర్ఎస్కు రాష్ట్రంలో 10 లోక్సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.