మోర్తాడ్, నవంబర్ 14: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకెళ్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రె స్ పార్టీ అడ్డగోలుగా దొంగ ఓట్లు వేయిస్తున్నా పోలీసులు, ఎన్నికల కమిషన్ చోద్యం చూసిందని పేర్కొన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా, నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టంచేశారు. ఓటమిని సవాల్గా తీసుకుని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.