ఖమ్మం, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో పర్యటించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తుమ్మలను వెంట తీసుకెళ్లారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం ప్రగతిభవన్లో తుమ్మల సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
సీతారామ ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నదని, సత్తుపల్లి వద్ద టన్నెల్ పనులు పూరి ్తచేస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని కేసీఆర్కు వివరించారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తుమ్మల తెలిపారు.