హైదరాబాద్ : చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను((Bodige Shobha) మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar )పరామర్శించారు. బొడిగె శోభ భర్త గాలన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం వారి స్వగ్రామం వెంకటేశ్వర పల్లెలో శోభ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. గాలన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన వెంట పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు.