కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 20: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణవాది, రచయిత, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు బుధవారం అర్ధరాత్రి అనారోగ్యం తో హైదరాబాద్లో మృతి చెందారు. కరీంనగర్ నుంచి 1989లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు జగిత్యాల ఎమ్మెల్యేగా, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేశారు.
జగపతిరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సంతాపం తెలియజేశారు.