హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏపీ సూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏ రామలింగేశ్వర్రావు అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. ఆయన జర్మనీలో ఉంటున్న కూతురిని చూసేందుకు ఇటీవల వెళ్లగా, గుండెపోటుతో అక్కడే కన్నుమూశారు. ఏపీ ప్రభుత్వం చొరవతో ఆయన భౌతికకాయాన్ని జర్మనీ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు.
గురువారం న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ, మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి, మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ తదితరులు రామలింగేశ్వర్రావు పార్థివదేహానికి నివాళులర్పించారు. పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు ఆయన మృతికి సంతాపం తెలిపారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవుల రక్షణ, చెంచుల హకుల కోసం రామలింగేశ్వర్రావు న్యాయవాదిగా వాదించిన ‘సమత’ కేసుగా దేశమంతా ప్రసిద్ధి చెందింది.