ఆదిలాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారు.
టికెట్లు అమ్ముకుంటూ కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాకముందే డబ్బులు దోచుకుంటున్నారని కాంగ్రెస్కు ఇటీవలే రాజీనామా చేసిన జిల్లా నాయకులు సాజిద్ ఖాన్, సుజాత, సంజీవరెడ్డి మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో రేవంత్రెడ్డిపై నిప్పులు చెరిగారు. తుపాకీ, కత్తులు లేకుండా హత్యలు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్గ్ర
ఇందుకు నిదర్శనం బోథ్ కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల అశోక్ టికెట్ మార్పే నిదర్శ నమన్నారు.నియోజకవర్గంలో 11 రోజులపాటు ప్రచారం చేసి డబ్బులు ఖర్చు చేసిన వ్యక్తికి బీ ఫాం ఇవ్వలేదు. ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు మాట్లాడారు. కంది శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తానని రామచంద్రారెడ్డి ఏనాడు చెప్పలేదన్నారు. ఈ వ్యాఖ్యలపై మేము సవాల్ చేస్తున్నాం.
పెద్దమ్మ గుడి వద్ద రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలన్నారు. రేవంత్ సభలో మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్ర రెడ్డి ఫొటోకు నివాళులర్పించలేదు. ఆయన గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. రేపు ఇండిపెండెంట్ అభ్యర్థిగా సంజీవరెడ్డి నామినేషన్ వేస్తున్నారని స్పష్టం చేశారు.