హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి చైర్మన్గా సీఎస్ శాంతికుమారి వ్యవహరించనున్నారు. దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా ని ర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ప్రత్యేక కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ సూ చనల మేరకు సంబంధిత అధికారులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేయనున్నారు.
కమిటీలో ఎవరు ఉన్నారంటే..
ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ప్లానింగ్), స్పెష ల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ అండ్ యూ డీ), ప్రిన్సిపల్ సెక్రటరీ పీఆర్ అండ్ ఆ ర్డీ, సెక్రటరీ టు గవర్నమెంట్ (జీఏడీ), టీకే శ్రీదేవి (ఫైనాన్స్ సెక్రటరీ), సెక్రట రీ (పీఈ డిపార్ట్మెంట్), ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డైరెక్టర్లు సభ్యులుగా ఉం టారు. కమిటీకి కన్వీనర్గా ఐ అండ్ పీ ఆర్ స్పెషల్ కమిషనర్ వ్యవహరిస్తారు.