హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిష్ఫుడ్ ఫెస్టివల్’ను నిర్వహించనున్నట్టు మత్స్య, పాడిపరిశ్రమల అ భివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృగశి ర కార్తెను పురస్కరించుకుని జూన్ 8 నుంచి 10 మధ్య అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై పశుసంవర్థకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సి న్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాలతో కలిసి మత్స్యశాఖ అధికారులతో మంత్రి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యా దవ్ మాట్లాడుతూ.. ఫిష్ఫుడ్ ఫెస్టివల్ను ఘ నంగా నిర్వహించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించా రు. స్వయం ఉపాధి కోసం మత్స్యకార మహిళలకు చేపలతో వివిధ రకాల వంటకాల త యారీపై ఉచితంగా శిక్షణ ఇచ్చినట్టు తెలిపా రు. ఫెస్టివల్లో 20 నుంచి 30 వరకు స్టాల్స్ ఉండేలా చూడాలన్నారు. చేపల వంటకాలతోపాటు విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫెస్టివల్ కు తరలివచ్చే వారికి ఆహ్లాదాన్ని పంచేలా మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, మత్స్యరంగంలో విశేష సేవలందించిన వారిని సన్మానించాలని ఆదేశించారు.
పిట్టల రవీందర్కు సత్కారం
మత్స్య సహకార సంఘాల సొసైటీ చైర్మన్గా నూతనంగా ని యమితులైన పిట్టల రవీందర్ సచివాలయంలోని మంత్రి చాంబర్లో తలసానిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సతరించి శుభాకాంక్షలు తెలిపారు.
పశువైద్యుల సమస్యలు పరిష్కరిస్తాం
పశువైద్యుల సమస్యల పరిషారానికి కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. సచివాలయంలోని తన చాంబర్లో వీఏఎస్ అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం జరిగిన సమావేశంలో మం త్రి మాట్లాడారు. వీధికుకలు, కోతుల బెడద నివారణ, వాటికి అవసరమైన వైద్యసేవలు, పర్యవేక్షణకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కోరారు.