MLC Kavitha | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మా ప్రజల ప్రేమకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఓ వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తున్న ఫోటోను ట్యాగ్ చేశారు కవిత.
నందిపేట్ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్ రావు పాల్గొన్నారు. ఆలయం వద్దకు వచ్చిన పలువురు మహిళలతో కవిత ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు కవితను ఆశీర్వదించారు.
Forever indebted for this love and choicest blessings by our people.
Today, while in the constituency ❤️ pic.twitter.com/Rr4tEZh89h
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 30, 2023