నిర్మల్: జిల్లాలోని కుభీర్ మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని చాత గ్రామ శివారులో పులి సంచరిస్తున్నది. రెండు రోజుల క్రితం గ్రామంలో ఓ లేగ దూడను పులి చంపేసింది. భయాందోళనలకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు రెండు రోజులుగా పులికోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చాత గ్రామ శివారులో పులి వేలిముద్రలను గుర్తించారు. వాటి ఆధారంగా గాలింపు ముమ్మరం చేశారు. అయితే గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.