AP News | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అటవీశాఖ అధికారులు శ్రీకాకుళం జిల్లాలో రెండు విదేశీ కోతులను గుర్తించారు. వీటిని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పశ్చిమబెంగాల్కు చెందిన సౌరభ్ మండల్, ధనుంజయ్సింగ్, ముఖేశ్రామ్గా గుర్తించారు. టెకలి సబ్డివిజన్ అటవీశాఖాధికారి నాగేంద్రరావు, కాశీబుగ్గ రేంజ్ అధికారి మురళీకృష్ణ, సిబ్బంది ఇచ్ఛాపురం చెక్ పోస్టు దగ్గర చేపట్టిన తనిఖీల్లో కోతులను గుర్తించారు.
వీటిని అసోం నుంచి కోల్కతా మీదుగా కారులో చెన్నై తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దక్షిణాఫ్రికాలోని ఉగాండా అటవీజాతి సంతతికి చెందిన అరుదైన ఎల్హోస్ట్ ఆడ, మగ కోతులుగా అటవీ అధికారులు గుర్తించారు. కారును సీజ్ చేసిన పోలీసులు నిందితులను ఇచ్ఛాపురం కోర్టులో హాజరుపరిచారు. కోతులను కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ ఆఫీసుకు తరలించారు.