హైదరాబాద్, నమస్తే తెలంగాణ; ములుగులోని ఫారెస్ట్ కాలేజీ ఆవరణం పచ్చదనానికి అద్దం పడుతున్నదని ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆ కాలేజీ ఏరియల్ వ్యూ ఫొటోలను పోస్టు చేస్తూ సీఎం కేసీఆర్ శ్రద్ధను కీర్తించారు. ‘తెలంగాణలో ములుగు ఫారెస్ట్ కాలేజీ మొదటిది.. త్వరలోనే విశ్వవిద్యాలయంగా రూపాంతరం కానున్నది.. క్యాంపస్లో సంతరించుకున్న ఆహ్లాదకరమైన పచ్చదనం.. సీఎం కేసీఆర్ తెలంగాణ హరితహారంపై చూపిన శ్రద్ధకు ప్రతిఫలం. సీఎం కేసీఆర్ నాయకత్వం ఈ అత్యాధునిక క్యాంపస్కు జన్మనిచ్చింది.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు అద్దం పడుతున్నది. ఈ ఘనత సాధించడానికి హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ చూపిన కృషి అభినందనీయం. విశ్వవిద్యాలయం ఆవరణలో నెలకొన్న పచ్చదనం ఆహ్లాదకరంగా ఉంది’.. అంటూ ట్వీట్ చేశారు.