హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ సమతుల్యతలో పక్షులది కీలకపాత్రని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ (ఈపీటీఆర్ఐ) రూపొందించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణానికి పక్షులు చేసే సహకారాన్ని, ప్రస్తుత పరిస్థితుల్లో పక్షులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించడంపై ఈపీటీఆర్ఐ సంస్థను అభినందించారు. పక్షులు పంటల్లో చీడ, పీడల నియంత్రణకు ఎంతగానో దోహదపతాయని చెప్పారు. పక్షులు బాగుంటేనే మనిషి భవిష్యత్తు బాగుంటుందని, ఈ విషయంపై అందరికీ అవగాహన అవసరమని మంత్రి తెలిపారు.