Harish Rao: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాల్లో ఔషధాల కొరత బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య మంత్రి హరీశ్రావు అన్నారు. ఔషధాల కొరత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.
ఔషధాల కొరతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. సమీక్ష జరిపి పీహెచ్సీల్లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.