హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి వెళ్తున్న ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ ప్రయాణికుడి వద్ద రూ. 11,70,256ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు అధికారులు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.