జోగులాంబ గద్వాల : ఫుడ్ పాయిజన్తో(Food poisoning) 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి (Rekulapally) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(Government School) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం భోజనం చేసిన అనంతరం విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో బాధపడుతుండడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ సౌమ్య తెలిపారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి దవాఖానకు చేరుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారి ఇండ్లకు పంపించారు.