బెల్లంపల్లి, ఫిబ్రవరి 6: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లిబస్తీ ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారు. శుక్రవారం రాత్రి హాస్టల్లో భోజనం చేసిన కాసేపటికి విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, గొంతు మండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది.
బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, నాయకులు అరుణ్ప్రసాద్, ఈట రాకేశ్, నరేశ్, మహంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 6, 7వ తరగతి చెందిన 15 మంది విద్యార్థినులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.