హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో వరుసగా విద్యార్థులకు ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని బోడియాతండా ప్రభుత్వ పాఠశాలలో 38 మంది, వనపర్తి జిల్లా కొత్తకోట ప్రభుత్వ బాలికల కళాశాలలో 40 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురికావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పునరావృతమవుతున్న ఘటనలపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.