వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ వనపర్తిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వనపర్తి కోసం నిరంజన్ రెడ్డి ప్రాణం పెడతాడని.. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నేతగా ఉంటూ.. ఇప్పుడు మంత్రిగా నిరంజన్ రెడ్డి అందిస్తున్న సేవలు అద్బుతమన్నారు కేసీఆర్.
ఈ నేపథ్యంలో సభ ప్రాంగణంలో దివంగత గాయకుడూ సాయి చంద్ సేవలను గుర్తుచేశారు కేసీఆర్. ‘ ఈ నాడు మనమధ్య లేని గాయకుడు సాయి చంద్ తన గొంతుతో తెలంగాణ ప్రజానీకాన్ని ఉత్తేజపరిచాడు’ అని కేసీఆర్ కొనియాడారు. అయితే ఇదే వనపర్తి సభలో పాల్గొన్న సాయి చంద్ భార్య రజిని ఎమోషనల్ అయ్యారు. సీఎం కేసీఆర్ సాయి చంద్ పేరు ఎత్తగానే పెద్ద ఎత్తున ప్రజల నుండి వచ్చిన స్పందన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు సాయి చంద్ భార్య రజిని.