కాళేశ్వరం/మహదేవపూర్/బోయినపల్లి, ఆగస్టు 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, గోదావరి (సరస్వతి బరాజ్) నీటితో పుష్కరఘాట్ వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతూ వస్తున్నది. సాయంత్రానికి 07.68 మీటర్ల ఎత్తుకు చేరుకున్నది. సరస్వతి బరాజ్కు 20,455 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 7 గేట్లు ఎత్తి 15,750 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బరాజ్లో 10.87 టీఎంసీలకు ప్రస్తుతం 7.62 టీఎంసీల నీరున్నది. మహదేవపూర్ మండలంలోని లక్ష్మి బరాజ్కు కూడా నీటి ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం 11.409 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో బరాజ్లో 24 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. బరాజ్కు 60,960 క్యూసెక్కుల ఇన్ఫ్లో, ఔట్ఫ్లో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్దగల ఎస్సారార్ నుంచి మంగళవారం రాత్రి నీటిని విడుదల చేశారు. రెండు గేట్ల ద్వారా 2606 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీకి వదిలారు.