ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ మల్లన్న ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. చుట్టూ భారీగా నీరు చేరుకోవడంతో దైవ దర్శనం కష్టమవుతున్నది.
ఆలయ నిర్వాహకులు భక్తులకు దైవ దర్శనం కల్పించేందుకు తాత్కాలికంగా తెప్పలు ఏర్పాటు చేశారు.