నాగర్కర్నూల్ : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల నుంచి 1,50,495 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,59,888 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 858.60 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 101.6785 టీఎంసీలు. పూర్తి నీటినిల్వ 215.807 టీఎంసీలు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.