అయిజ, మే 25: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం స్థిరంగా చేరుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 16,332, అవుట్ఫ్లో 357 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి పూర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.810 టీఎంసీల నిల్వ ఉన్నది. నీటిమట్టం 1633 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1609.77 అడుగులకు చేరినట్లు బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువ నుంచి స్వల్పంగా వరద చేరుతున్నది. దిగువన ఉన్న సుంకేశుల బ్యారేజీకి 1100 క్యూసెక్కులు చేరుతున్నాయని ఆర్డీఎస్ కర్ణాటక ఏఈ శ్రీనివాస్ తెలిపారు.