హైదరాబాద్ : త్వరలో వరంగల్ (మామునూరు) నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సింధియా హామీ ఇవ్వడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నిన్న (శనివారం) సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వరంగల్(మామునూర్) విమానాశ్రయం నుంచి విమానాలు నడపాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి సింధియాను కోరారు. కోరిన వెంటనే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్ (ఏఐ) ఏటీఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు వరంగల్(మామునుర్) విమానాశ్రయం నుంచి త్వరలో విమానాలు రాకపోకలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింధియాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృత నిశ్చయంతో వున్నారని తెలిపారు.