ఏటూరు నాగారం, జూన్ 28: ఐదుగురు మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యులను అరెస్టు చేసినట్టు సీఐ రాజు తెలిపారు. బుధవారం ఉదయం ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి వారి నుంచి రెండు డిటోనేటర్లు, 20 మీటర్ల కార్డెక్స్ వైరు, 10 మీటర్ల ఎలక్ట్రికల్ వైరు, ప్రెషర్ కుక్కర్, రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాలను రెండు ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్టు సీఐ తెలిపారు. వారిని విచారించగా పోలీసులను హతమార్చేందుకు కుట్ర పన్ని రెక్కీ నిర్వహిస్తున్నట్టు అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు.