Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా కోరెం అశోక్ రెడ్డి నియామకం అయ్యారు. 2014 బ్యాచ్కు చెందిన అశోక్ రెడ్డి ప్రస్తుతం ఆర్థిక మంత్రి హరీశ్రావు దగ్గర ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సీసీఎల్ఏ ప్రత్యేకాధికారిగా ఆశిష్ సంగ్వాన్, సీసీఎల్ఏ కార్యదర్శిగా బీ గోపీ నియామకం అయ్యారు. సీసీఎల్ఏ కార్యదర్శి కే హైమావతి, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్య శారద కూడా బదిలీ అయ్యారు. ఈ ఇద్దరిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.