హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమసే తెలంగాణ): రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి హరీశ్రావు వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న కే అశోక్రెడ్డిని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, ఎక్స్ అఫిషియో స్పెషల్ సెక్రటరీగా నియమించారు. సీసీఎల్ఏ ప్రత్యేకాధికారిగా ఆశిష్ సంగ్వాన్, సీసీఎల్ఏ కార్యదర్శిగా బీ గోపి నియమితులయ్యారు.
ఇప్పటివరకు సీసీఎల్ఏ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కే హైమావతితోపాటు సీసీఎల్ఏ ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న సత్యశారదను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.