కోదాడ రూరల్, నవంబర్ 13: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందా రు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారులు గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాల్వ సమీపంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ నిర్వహించారు.
మాలధారుల బంధువులు, కుటుంబసభ్యులు, భక్తులు గ్రామానికి చెందిన సైదులు ట్రాక్టర్లో వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో 32 మంది భక్తులతో ట్రాక్టర్ బయల్దేరింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ, ట్రాక్టర్ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో చింతకాయల ప్రమీల (41), తన్నీరు ప్రమీల (30), నారగాని కోటయ్య (60), గండు జ్యోతి (40), చింతకాయల ఉదయ్ లోకేశ్ (10) మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు.