హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటి వరకు 5కోట్ల డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ప్రజల స్ఫూర్తి, వైద్య సిబ్బంది అంకితభావంతోనే ఈ ఘనతను సాధించామన్నారు. అనేక ఆటంకాలు దాటి ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. వ్యాక్సినేషన్ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.