ఓవైపు భానుడి ప్రతాపం పెరిగిపోగా మరోవైపు చెరువులు ఎండిపోతున్నా యి. ఈ క్రమంలో ఎండ వేడిమిని భరించలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని చింతకాని గూడెపు చెరువులో చేపలు మృత్యువాతపడ్డాయి.
మృతిచెందిన చేపలు నీటిపై తేలుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. చేపల మృతితో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
– మహదేవపూర్ (కాటారం)