Fish Prasadam | అబిడ్స్, జూన్ 8: మృగశిర కార్తె సందర్భంగా నేటి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఉబ్బసంతో బాధపడుతున్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేయనుండగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభిస్తారు.
చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.