తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరింది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీకి అడుగుపెడుతున్నారు. పాలకుర్తిలో యశస్విని రెడ్డి, మెదక్లో మైనంపల్లి రోహిత్ రావు, వేములవాడలో ఆదిశ్రీనివాస్, రామగుండంలో రాజ్ ఠాగూర్, కంటోన్మెంట్లో లాస్య నందిత, నాగార్జున సాగర్లో కుందూరు జయవీర్ రెడ్డి, నాగర్కర్నూల్లో కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎల్లారెడ్డిలో కే.మదన్మోహన్ రావు, మందుల సామేల్, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, నారాయణ్పేట్లో పర్నికా రెడ్డి, వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట కేఆర్ నాగరాజు తొలిసారిగా అసెంబ్లీలో ప్రవేశిస్తున్నారు.
దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, చెన్నూరులో ఎంపీ వివేక్, కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆలేరు బీర్ల అయిలయ్య, పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.