రుద్రూర్, సెప్టెంబర్ 16: ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదలచేసిన అగ్రిసెట్ -2021 ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామానికి చెందిన చంద అనూహ్య స్టేట్ ఫస్ట్ర్యాంకు సాధించినట్టు ఆమె కుటుంబసభ్యులు గురువారం తెలిపారు. తెలంగాణ నుంచి సీడ్ టెక్నాలజీ విభాగంలో అనూహ్య మొదటిస్థానంలో నిలువడం సంతోషంగా ఉన్నదని తండ్రి చంద రవి తెలిపారు.